చంద్ర‌బాబు మ‌రో యూట‌ర్న్‌... బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం!! | Oneindia Telugu

  • 5 years ago
Telugu Desam Party Elected Lok Sabha member from Vijayawada Constituency Kesineni Nani met Vice President of India M Venkaiah Naidu. Around half an hour meeting between them. The meeting is reason to raised eyebrow of the Political Analytics. Telugu Desam Party Chief, Former Chief Minister of Andhra Pradesh Chandrababu sent Kesineni as his ambassador for re entry in NDA, says reports.
#vicepresidentofindia
#venkaiahnaidu
#tdp
#Loksabha
#MP
#kesineninani
#vijayawada
#bjp
#amithshah
#modi
#special status

తెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రో యూట‌ర్న్ తీసుకోబోతున్నారా? భార‌తీయ జ‌న‌తాపార్టీ పంచ‌న చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఎన్డీఏ నుంచి బ‌య‌టికి రావ‌డం ఘోర త‌ప్పిద‌మ‌ని ఇదివ‌ర‌కే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన ఆయ‌న మ‌రోసారి అదే కూట‌మిలోకి వెళ్ల‌డానికి రాయబారం న‌డిపిస్తున్నారా? దీనికోసం ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు మ‌ద్దతును ఆశిస్తున్నారా? రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తోంటే- ఇది నిజ‌మే అనిపిస్తోంది. ఎన్డీఏలో చేర‌డం ద్వారా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తీసుకుని వ‌చ్చి పూర్వ‌వైభ‌వాన్ని సాధించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా ఆయ‌న- విజ‌య‌వాడ లోక్‌స‌భ స‌భ్యుడు కేశినేని నానిని రాయ‌బారానికి పంపించార‌ని తెలుస్తోంది. కేశినేని నాని ఉప రాష్ట్ర‌ప‌తి ఎం వెంక‌య్య‌నాయుడితో భేటీ కావ‌డం, సుమారు అర‌గంట‌కుపైగా వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు సాగ‌డం అనేక సందేహాల‌ను లేవ‌నెత్తింది. ఈ స‌మావేశంలోనే కేశినేని ఫోన్ ద్వారా చంద్ర‌బాబును వెంక‌య్య నాయుడితో మాట్లాడించార‌ని అంటున్నారు. చంద్ర‌బాబు, తెలుగుదేశం పార్టీ రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై చ‌ర్చించార‌ని స‌మాచారం.

Recommended