Rashmi Gautam Reacts On Pulwama Tragedy | FilmiBeat Telugu

  • 5 years ago
Rashmi Gautam reacts on Pulwama Tragedy . She objected pro Pak slogans made in social media. She said At the time of partition he was supposed to go to the other side sadly to our bad luck he stayed back here.
#RashmiGautam
#PulwamaTragedy
#rashmitweetonpulwamatragedy
#anchorrashmi
#sudigalisudheer
#tollywood

జమ్ము, కశ్మీర్‌లో భారత సైనికులపై ఉగ్రదాడి ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. పైశాచిక దాడిని ప్రతీ ఒక్కరు నీచమైన ఘటనగా అభివర్ణిస్తూ పాకిస్థాన్ అనుకూల వర్గంపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. పుల్వామాలో సైనికులపై ఉగ్రదాడి అనంతరం క్రికెటర్, రాజకీయవేత్త నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇతర వ్యక్తులు ఉగ్రదాడికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి వ్యక్తులను యాంకర్ రష్మీ చీల్చి చెండాడారు. ఇంతకీ ఏమైందంటే..
పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం సోషల్ మీడియాలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించిన తీరు అత్యంత వివాదాస్పదమైంది. ఉగ్రదాడికి జాతి బాధ్యత వహించదు. ఉగ్రవాదులకు మతం, కులం, వర్గం లేదు అని సిద్ధు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే ఓ నెటిజన్ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ చేసిన వ్యాఖ్యలపై రష్మీ మండిపడ్డారు.
నీ పాకిస్థాన్‌ గొప్పతనం ఏంటిరా? సాలే మావాడివి అయిపోయావు కాబట్టి బతికి బయటపడ్డావు. మాతోనే మీ అస్థిత్వం. లేకపోతే నువు దానితో సమానం. మూసుకొని కూచో అంటూ రష్మీ ఫైర్ అయింది. దేశ విభజన సమయంలో అవతలి వైపు వెళ్లాల్సింది. కానీ మన దురదృష్టం కొద్ది ఈ దేశంలో ఉన్నాడు అని అన్నారు.

Recommended