ఆంధ్రప్రదేశ్ ఈ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రం : చంద్రబాబు

  • 6 years ago
Amaravathi: The Andhra Pradesh Government has demanded Rs 4,79,823 crore as revenue deficit grant from the Central government.
#chandrababu
#N Ksingh
#Amaravathi
#AndhraPradesh
#titli
#Centralgovernment


ఈ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...నిరంతరం 10.5శాతం వృద్ధి సాధిస్తున్నా పక్క రాష్ట్రాలతో సమం కాలేకపోతున్నాం. అందుకే కేంద్రం, ఆర్థిక సంఘం ఉదారంగా వ్యవహరించి ఎపికి సాయం చేయాలి అని 15 వ ఆర్థిక సంఘానికి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సమావేశంలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.4,79,823 కోట్లు గ్రాంట్ ఇచ్చి గట్టెక్కించాలని ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. సిఎం అభ్యర్థనల విషయమై ఎన్ కె సింగ్‌ మాట్లాడుతూ ఆర్థిక సంఘం విధివిధానాలకు లోబడి సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు.

Recommended