Island Claimed By India And Bangladesh Sinks Below Waves
  • 6 years ago
For nearly 30 years, India and Bangladesh have argued over control of a tiny rock island in the Bay of Bengal. Now rising sea levels have resolved the dispute for them: the island has gone.
#southtalpatti
#newmoore
#india
#bangladesh
#globalwarming


ప్రపంచమంతా ‘గ్లోబల్ వార్మింగ్‌’పై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ గ్లోబల్ వార్మింగ్ ఓ దీర్ఘకాలిక వివాదాన్ని పరిష్కరిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. వివరాల్లోకి వెళ్తే.. 1970లో బంగ్లాదేశ్‌లో ‘భోలా’ తుఫాన్ ఏర్పడింది. ఈ సందర్భంగా గంగా, బ్రహ్మపుత్ర డెల్టా ప్రాంతంలో 2,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఓ చిన్న ద్వీపం బయటపడింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సుందర్బన్‌ అడవులకు దక్షిణంలో ఈ ద్వీపం ఉంది. ఇది అంతర్జాతీయ జలాల సరిహద్దు మధ్యలో ఉండటంతో ఈ ద్వీపం తమదంటే తమదని ఇండియా, బంగ్లాదేశ్‌లు వాదించుకున్నాయి. ఇండియా ఈ ద్వీపానికి ‘న్యూ మూర్’ అని, బంగ్లాదేశ్ ఈ ‘సౌత్ తల్‌పట్టి’ అని పేరు పెట్టాయి. వాస్తవానికి ఈ ద్వీపం ఇండియాలోకే వస్తుంది. భారత్ - బంగ్లాదేశ్‌ల సరిహద్దులను విభజించే హరియాభంగా నది సముద్రంలో కలిసే ప్రాంతానికి మధ్యలో ఈ ద్వీపం ఉండటం వల్లే ఈ సమస్య ఏర్పడింది.
Recommended