India vs England 2nd ODI : Anushka Kisses Kohli In England Match
  • 6 years ago
సుదీర్ఘమైన సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. క్రికెటర్లతో పాటు వారి భార్యలు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో అనుష్క శర్మ, అయేషా, సాక్షి, గ్రేసియా, రితిక టీమిండియా ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు.
ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను గెలుచుకున్న టీమిండియా వన్డే సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డే కోహ్లీసేన 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలి వన్డేకు క్రికెటర్ల భార్యలు సైతం హాజరయ్యారు. ఈ క్రమంలో ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు, హాఫ్ సెంచరీలు నమోదు చేసినప్పుడు వీరంతా గ్యాలరీలో కూర్చుని చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ తన భర్త, కెప్టెన్ కోహ్లీకి ముద్దులు విసురుతూ కనిపించింది.
Recommended