కుమార స్వామి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి తెలుగు ముఖ్య‌మంత్రులు
  • 6 years ago
In Karnataka both jds and congress becoming alliance and farming the government. on 24th of may jds chief kumara swamy taking oath as Karnataka chief minister. for the event kumara swamy welcomed ap cm chandrababu and telangana cm kcr. but both leaders have rivality with congress party, so both the telugu chief ministers may not attend the oath taking event.

కుమార స్వామి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. జేడీయ‌స్ పార్టీకి చెందిన కుమార స్వామి ముఖ్య‌మంత్రి పీఠం అదిరోహిస్తున్నందుకు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నప్ప‌టికి కాంగ్రేస్ పార్టీతో జ‌త‌క‌ట్టే అంశ‌మే స‌మ‌స్య‌గా మారింది. దీంతో ఒకే వేదిక మీద కాంగ్రేస్ నేత‌ల మ‌ద్య ఎలా గ‌డ‌పాలా అని తెలుగు ముఖ్య‌మంత్రులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. చంద్ర‌బాబుతో పాటు కేసీఆర్ కూడా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి వెళ్ల‌కుండా ఉంటేనే మంచిద‌నే నిర్ణ‌యానికి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.
క‌ర్ణాట‌క లో కుమార స్వామి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఇద్ద‌రు తెలుగు ముఖ్య‌మంత్రుల‌ను ఆహ్వానిస్తూ త‌న విధేయ‌త‌ను చాటుకున్నారు జేడీయ‌స్ చీఫ్. ఈ నెల 24న అట్టహాసంగా జ‌రిగే ప్ర‌మాణ స్వీకారానికి దేశ వ్యాప్తంగా అనేక మంది రాజ‌కీయ నేత‌ల‌ను ఆహ్వానించాల‌ని జేడీయ‌స్ ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. అందులో భాగంగా ఏపి నుండి చంద్ర‌బాబును, తెలంగాణా నుండి చంద్ర‌శేఖ‌ర్ రావును ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. ఇంత వ‌ర‌కు క‌థ బాగానే ఉన్నా తెలుగు ముఖ్య‌మంత్రులు మాత్రం ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లే అంశం ప‌ట్ల సందిగ్ద‌త వ్య‌క్తం చేస్తున్నారు. జేడీయ‌స్ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించే అవ‌క‌శాలు ఏ కోశానా నేన‌ప్ప‌టికి ఆ పార్టీ జ‌త‌క‌డుతున్న‌ది కాంగ్రెస్ పార్టీతో కాబ‌ట్టి అస‌లు స‌మ‌స్య అక్క‌డే మొద‌లవుతున్న‌ట్టు తెలుస్తోంది.
Recommended