IPL 2018 : Dhoni With His Daughter Ziva In Stadium
- 6 years ago
Mahendra Singh Dhoni,Deepak Chahar And Lungi Andig Playing With ziva dhoni after defeating Kings XI Punjab
#Dhoni
#Daughter
#Ziva
#KingsXiPunjab
#IPL2018
ఈ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్కు చేరిన రెండో జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ అసాంతం చెన్నై కెప్టెన్ ధోనితో పాటు కుమార్తె జీవాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా ధోని-జీవాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రజంటేషన్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ధోని తన కుమార్తె జీవాతో కలిసి మైదానంలో ఆడుకుంటూ కాసేపు సందడి చేశాడు. ఆ సమయంలో జీవా తన తండ్రి ధోనీ తలపై ఉన్న టోపీ తీయడం ఆ తర్వాత పెడుతూ కనిపించింది.
ఆ తర్వాత ధోని... జీవాతో ఏదో మాట్లాడటంతో జీవా ఆనందంతో గెంతులేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని చెన్నై యూనివర్స్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోని చూసిన అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేసిన చెన్నై ప్లేఆఫ్కు చేరుకుంది.
#Dhoni
#Daughter
#Ziva
#KingsXiPunjab
#IPL2018
ఈ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్కు చేరిన రెండో జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ అసాంతం చెన్నై కెప్టెన్ ధోనితో పాటు కుమార్తె జీవాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా ధోని-జీవాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రజంటేషన్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ధోని తన కుమార్తె జీవాతో కలిసి మైదానంలో ఆడుకుంటూ కాసేపు సందడి చేశాడు. ఆ సమయంలో జీవా తన తండ్రి ధోనీ తలపై ఉన్న టోపీ తీయడం ఆ తర్వాత పెడుతూ కనిపించింది.
ఆ తర్వాత ధోని... జీవాతో ఏదో మాట్లాడటంతో జీవా ఆనందంతో గెంతులేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని చెన్నై యూనివర్స్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోని చూసిన అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేసిన చెన్నై ప్లేఆఫ్కు చేరుకుంది.