మహేష్, ప్రభాస్ లాగా పుట్టుంటే బావుండేది
- 6 years ago
Raising Raju comments on Sudheer and Rashmi love affair. He praised Hyper Aadi. And Jabardasth 'Raising Raju' revealed some intresting matters also.
బుల్లి తెరపై దుమ్ములేపుతున్న టివి కార్యక్రమాల్లో జబర్దస్త్ కూడా ఒకటి. అలాగే ఈ షో నుంచి పలువురు హాస్య నటులు సినిమా అవకాశాలని పొందుతున్నారు. మరికొందరు పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. రైజింగ్ రాజు కూడా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు.
జబర్దస్త్ లో హైపర్ ఆది టీంలో రైజింగ్ రాజు సభ్యుడు. లేడి గెటప్స్ తో రైజింగ్ రాజు మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ఇంటర్వ్యూ లో రైజింగ్ రాజు పలు విషయాలు వెల్లడించాడు.
జబర్దస్త్ లో టీం లీడర్స్ సభ్యులని వాడుకుని డబ్బులు ఇవ్వకుండా వదిలేస్తారా అనే ప్రశ్నకు రైజింగ్ రాజు సమాధానం ఇచ్చారు. అన్ని టీంల గురించి నాకు తెలియదని రైజింగ్ రాజు అన్నారు. కానీ మా టీం వరకు హైపర్ ఆది అలాంటి వారు కాదని, సభ్యులందరికి డబ్బులు ఇస్తారని అన్నారు.
హైపర్ అది ఎప్పుడూ రైజింగ్ రాజు శరీరంపై పంచులు వేస్తుంటాడు.దీనికి మీరు ఫీలవరా అనే ప్రశ్నకు రైజింగ్ రాజు భిన్నంగా స్పందించాడు. తనకు జనాల్లో పాపులారిటీ పెరగడానికి కారణం ఆదిగారే అని రైజింగ్ రాజు అన్నారు.
తెలుగు వారు ఆరాధించే ఎన్టీఆర్ కూడా రాజబాబు, రేలంగి వంటి వారి శరీరాలపై హాస్యం పండించారని, దానివల్ల వారి పాపులారిటీ ఇంకా పెరిగిందని అన్నారు.మహేష్, ప్రభాస్ లాగా పుట్టుంటే బావుండేదని అంతా అనుకుంటారు. కానీ దేవుడు మనకు ఇచ్చిన రూపంతోనే దూసుకుపోవాలని రైజింగ్ రాజు అన్నారు.
స్కిట్ మధ్యలో సుధీర్, రష్మీపై పంచులు పడుతుంటాయి. అది కేవలం సరదా, హాస్యం పండించేందుకు మాత్రమే అని రైజింగ్ రాజు తెలిపారు. వారి మీద పంచులు వేయడంలో మరో ఉద్దేశం లేదని తెలిపాడు.
సుధీర్, రష్మీ మధ్య ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని రైజింగ్ రాజు తెలిపాడు. వారిద్దరూ సరదాగా కనిపించడం వలన అలా అనుకుంటారని తెలిపాడు.
బుల్లి తెరపై దుమ్ములేపుతున్న టివి కార్యక్రమాల్లో జబర్దస్త్ కూడా ఒకటి. అలాగే ఈ షో నుంచి పలువురు హాస్య నటులు సినిమా అవకాశాలని పొందుతున్నారు. మరికొందరు పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. రైజింగ్ రాజు కూడా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు.
జబర్దస్త్ లో హైపర్ ఆది టీంలో రైజింగ్ రాజు సభ్యుడు. లేడి గెటప్స్ తో రైజింగ్ రాజు మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ఇంటర్వ్యూ లో రైజింగ్ రాజు పలు విషయాలు వెల్లడించాడు.
జబర్దస్త్ లో టీం లీడర్స్ సభ్యులని వాడుకుని డబ్బులు ఇవ్వకుండా వదిలేస్తారా అనే ప్రశ్నకు రైజింగ్ రాజు సమాధానం ఇచ్చారు. అన్ని టీంల గురించి నాకు తెలియదని రైజింగ్ రాజు అన్నారు. కానీ మా టీం వరకు హైపర్ ఆది అలాంటి వారు కాదని, సభ్యులందరికి డబ్బులు ఇస్తారని అన్నారు.
హైపర్ అది ఎప్పుడూ రైజింగ్ రాజు శరీరంపై పంచులు వేస్తుంటాడు.దీనికి మీరు ఫీలవరా అనే ప్రశ్నకు రైజింగ్ రాజు భిన్నంగా స్పందించాడు. తనకు జనాల్లో పాపులారిటీ పెరగడానికి కారణం ఆదిగారే అని రైజింగ్ రాజు అన్నారు.
తెలుగు వారు ఆరాధించే ఎన్టీఆర్ కూడా రాజబాబు, రేలంగి వంటి వారి శరీరాలపై హాస్యం పండించారని, దానివల్ల వారి పాపులారిటీ ఇంకా పెరిగిందని అన్నారు.మహేష్, ప్రభాస్ లాగా పుట్టుంటే బావుండేదని అంతా అనుకుంటారు. కానీ దేవుడు మనకు ఇచ్చిన రూపంతోనే దూసుకుపోవాలని రైజింగ్ రాజు అన్నారు.
స్కిట్ మధ్యలో సుధీర్, రష్మీపై పంచులు పడుతుంటాయి. అది కేవలం సరదా, హాస్యం పండించేందుకు మాత్రమే అని రైజింగ్ రాజు తెలిపారు. వారి మీద పంచులు వేయడంలో మరో ఉద్దేశం లేదని తెలిపాడు.
సుధీర్, రష్మీ మధ్య ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని రైజింగ్ రాజు తెలిపాడు. వారిద్దరూ సరదాగా కనిపించడం వలన అలా అనుకుంటారని తెలిపాడు.