Pariksha Pe Charcha : Modi Apologised to Students
  • 6 years ago
Prime Minister Narendra Modi on Friday held an event Pariksha Pe Charcha, where he took questions from students. Modi, who spoke in Hindi during the entire interaction, also apologised to students.


దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. బహుశా.. దీన్ని దృష్టిలో ఉంచుకునే మోడీ 'క్షమాపణలు' చెప్పారేమో!.. శుక్రవారం న్యూఢిల్లీలోని తల్కోతోరా స్టేడియంలో జరిగిన 'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

చర్చ సందర్భంగా మోడీ ఎక్కువగా హిందీలోనే మాట్లాడారు. దీంతో హిందీ రాని విద్యార్థులకు ఆయన చెప్పిన విషయాలు అంతగా అర్థం కాలేదు.

ఈ విషయాన్ని గుర్తించిన మోడీ.. 'భాష వల్ల కొంతమంది విద్యార్థులకు నేను చెప్పిన విషయాలు చేరలేకపోయి ఉంటాయి.. అందుకు క్షమాపణలు' అని చెప్పారు.

నాకు తమిళంలో మాట్లాడటం రాదు. తమిళం చాలా పాత భాష. సంస్కృతం కంటే పురాతమనైన భాష కానీ చాలా అందమైనది. నేను వణక్కం అని మాత్రమే చెప్పగలను. తమిళంలో మాట్లాడలేను' అని మోడీ పేర్కొన్నారు.


Recommended