YS Jagan Confirms MLA Tickets Based On PK Survey
  • 6 years ago
YCP Chief YS Jagan's Prajasankalpa Yatra reached to 18th day in Nellore District. The YCP leaders of the district eagarly waited to hear their names from their Chief's mouth, but that was not done. Till today YS Jagan announced only two mlas names in his padayatra.

వచ్చే ఎన్నికల్లో జగన్ తమకే టిక్కెట్ ఇస్తారని ఎంతో ఆశపెట్టుకుని ఉన్న జిల్లా నేతల్లో చాలామంది ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో కొట్టిమిట్టాడుతున్నారు. నెల్లూరు నగరం, సూళ్లూరుపేట స్థానాలకు తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా అభ్యర్థిత్వాలపై జగన్ నోరు మెదపలేదు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారంమే ఎవరికైనా టిక్కెట్లు అని గతంలో ప్రకటించిన వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఓ ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించి వారికి మద్దతు పలకాలని సూచించడంపై పార్టీలో పెద్ద దుమారం రేగుతోంది.
వైసీపీలో ప్రశాంత్ కిషోర్ హవా నడుస్తోందని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే మేరకే అభ్యర్థులు టిక్కెట్లు ఇస్తానంటూ ఇటీవల గుంటూరులో జరిగిన వైసీపీ సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించడంతో పీకే బృందానికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే ఈ బృందం నెల్లూరు జిల్లాలో పర్యటించి ప్రాథమికంగా కొంత సమాచారాన్ని జగన్‌కు అందించినట్లు తెలుస్తోంది.
జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతం చేసేలా ముందుగానే ప్రతి జిల్లాలో ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇదే అవకాశంగా జగన్ దృష్టిలో పడేందుకు, టిక్కెట్ల రేసులో పోటీ పడేందుకు ఆయా నేతలు లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. మరోవైపు వైఎస్ జగన్ సన్నిహితులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల బలాబలాలు, బలహీనతలు అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అధినేతకు చేరవేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జగన్ పాదయాత్ర, సభలు జరిగాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు సంజీవయ్య, అనిల్ ‌కుమార్ పేర్లు మాత్రమే ప్రస్తావించి వారికే ఈసారి టిక్కెట్ కన్ఫర్మ్ చేయడంపై పార్టీలో పెద్ద దుమారం రేగుతోంది. నిజానికి జగన్ బహిరంగ సభల్లో స్థానిక నేతల పేర్లు ప్రస్తావిస్తే.. ఆయా నియోజకవర్గాల్లో ఆయా నేతలకు కాస్త పట్టు పెరుగుతుంది. కానీ అలా చేయకుండా, ఎవరి పేరు ప్రకటించకుండా ఏకపక్షంగా ప్రసంగాలు చేసుకుంటూ జగన్ వెళ్లిపోతుండడంతో ఈసారి పార్టీ టిక్కెట్ లభిస్తుందో లేదో అనే ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది.
Recommended