వెనక్కి తగ్గని వెంకయ్య.. సమస్యలపై ప్రత్యేక దృష్టి !

  • 6 years ago
It is said that Vice president of India Venkaiah Naidu is still keen on Andhra Padesh issues.


ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వెంకయ్య నాయుడు తన దృష్టిని తగ్గిస్తారనే ప్రచారం సాగింది. అయితే, ఆయన ఇప్పటికీ రాష్ట్ర సమస్యలపై ఎప్పటిప్పుడు స్పందిస్తూ వాటిని పరిష్కరించడానికి చర్లు తీసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఢిల్లీలో ఇప్పటికీ ఆయన పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతోందని అంటున్నారు.
కేంద్ర మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించిన వెంకయ్య నాయుడికి కేంద్ర మంత్రులతో విరివిగా పరిచయాలు ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య తగాదాలు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరంపై బిజెపి నేతలతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ వారికి అందించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారికి సూచించారు.

Recommended