Modi impressed by Hyderabad Metro : Know Why ?
  • 6 years ago
Prime Minister Narendra Modi was impressed by the Hyderabad Metro Rail on Tuesday, according to government officials accompanying him during the inaugural ride from Miyapur to Kukatpally and back.

హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా సరదాగా గడిపారు. మెట్రో స్టేషన్లు, కోచ్‌లు అద్భుతంగా ఉన్నాయని మోడీ కితాబిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులతోనూ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా 'నేను ముందుకు నడపాల్సింది రైలును కాదు... దేశాన్ని' అని మోడీ అధికారులతో వ్యాఖ్యానించడం అందర్నీ నవ్వుల్లో ముంచింది. మంగళవారం హైదరాబాద్‌ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం అందులో ప్రయాణిస్తూ- ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు సంస్థ ఎండీ శివానంద నింబార్గిని ఉద్దేశించి ఈ మాటలన్నారు. మియాపూర్‌-కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ల నడుమ 11 నిమిషాల ప్రయాణంలో మోడీ అనేక విషయాలను ప్రస్తావించారు.
హైదరాబాద్‌ మెట్రోరైలు లోకో పైలట్‌ (డ్రైవరు)తో పెద్దగా సంబంధం లేకుండానే, ఉప్పల్‌ డిపోలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఆధారంగా నడుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌లో తిరిగే 57 రైళ్లలో మహిళలనే లోకో పైలెట్లుగా నియమించింది.
Recommended