Breaking : MLA Giddi Eswari Joined TDP : Watch Video

  • 6 years ago
YSR Congress Party Paderu MLA Giddi Eswari on Monday joined Telugu Desam in the presence of Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలువురు ఇతర నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. గిడ్డికి, ఇతర నాయకులకు సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పాడేరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెప్పారు. చంద్రబాబు పాలనలో గిరిజనుల బతుకులు బాగుపడతాయని భావిస్తున్నానని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తాను ఎప్పుడు కూడా గిరిజన పక్షపాతిని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన పనిని ప్రతిపక్ష నేత జగన్ గుర్తించకపోవడం వల్లే తాను టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. సీఎం సహకారంతో గిరిజనుల బతుకులు బాగుపడతాయన్నారు. గిరిజన సంక్షేమం కోసం తాను పడిన కష్టాన్ని జగన్ గుర్తించలేదన్నారు.

Recommended