India vs Australia 2nd T20 Match : India Sets Target As 119 | oneindia Telugu

  • 7 years ago
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా రెండో టీ20 కోసం భారత జట్టు ఆటగాళ్లు గౌహతికి చేరుకున్నారు. ఆస్ట్రేలియాను వన్డే సిరీస్‌లో మట్టికరిపించిన భారత్‌.. ఇప్పుడు టీ20 సిరీస్‌ మీదా కన్నేసింది. సిరీస్‌ ఆరంభ పోరులో ఘనవిజయం సాధించిన టీమ్‌ఇండియా, మంగళవారం గౌహతిలో జరిగే రెండో టీ20లో నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. రాంచీలో జరిగిన తొలి టీ20లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే
మూడు టీ20ల సిరిస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ సిరిస్‌లో చివరిదైన మూడో టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది.

Recommended