ఇండియన్ సినిమా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'పుష్ప 2' ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం మూవీమేకర్స్ బిహార్ పట్నాలో ఆదివారం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. పట్నా గాంధీ మైదాన్లో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో పుష్ప ది రూల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ఈవెంట్కు హీరో అల్లు అర్జున్- రష్మిక మంధన్నాతో సహా మూవీటీమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ ఒక్క ఈవెంట్ తో న్నీకి నార్త్ లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ఈ ఈవెంట్ ని చూస్తే అర్థమయిపోతుంది.