పెళ్లికి రెండు రోజుల ముందే యువతి ఆత్మహత్య

  • 2 years ago
ఏలూరు జిల్లాలో పెళ్లికి రెండు రోజుల ముందు యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది. ద్వారకాతిరుమల మండలం జాజులగుంటకు చెందిన అలేఖ్య డిగ్రీ వరకు చదివి ఇంటి దగ్గరే ఉంటోంది. ఆమెకు కొయ్యల గూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన బుచ్చిబాబు అనే వ్యక్తితో ఈ నెల 9న వివాహానికి ముహూర్తం కుదిరింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో మంగళవారం రాత్రి ఆమె చీర మార్చుకుంటానంటూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరి వేసుకుంది. అప్పటికే ఆమె చనిపోయింది.