హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలంలో భక్తుల రద్దీ

  • 2 years ago
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్య క్షేత్రానికి హనుమాన్ భక్తులు పోటెత్తారు. ఇవ్వాళ వైశాఖ బహుళ దశమి, పూర్వాభాద్ర నక్షత్రం వైశాఖ దశమి కలిసి రావడంతో భగవంతుడికి ప్రీతికరమైన రోజని.. ప్రతి ఏటా వైశాఖ బహుళ దశమి నాడు రాములోరి ఉత్సవాలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో అంతే ప్రత్యేకత హనుమంతుల వారి జయంతి నాడు కూడా ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, తమలపాకు పూజ అలాగే సాయంత్రం రాములోరితో తిరువీధి సేవ జరుగుతుందన్నారు. హనుమాన్ మాల ధరించి దీక్ష చేపట్టిన స్వాములు ఈ హనుమాన్ జయంతి నాడు మాల విరమణ చేస్తారని.. ఎక్కడా లేని విధంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగే గొప్ప క్షేత్రం భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి సన్నిధి మాత్రమేనని వివరించారు.

Recommended