YSRTP : రైతు బంధు వర్తించే అందరికి రైతు బీమా ఇవ్వాల్సిందే ! | Oneindia Telugu
  • 2 years ago
ysrtp demands cm kcr to give rythu bheema to every farmer , just like rytu bandhu scheme.
#rythubandhu
#rythubheema
#trsparty
#cmckr
#telangana
#ysrtp
#yssharmila

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. రాష్ట్రంలో 59 సంవ‌త్స‌రాలు పైబ‌డిన రైతులు చ‌నిపోతున్నారని పేర్కొన్నారు. మరీ వారికి రైతు బీమా ఇవ్వ‌క‌పోవడంతో నష్టపోతున్నారని వివరించారు. వ‌య‌సు ప‌రిమితి అంశాన్ని స‌వ‌రించాల‌ని కోరారు. ఇదివరకు తమ పార్టీ ప్ర‌భుత్వానికి నాలుగు వారాలు సమయం కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. అదీ స‌వ‌రించ‌క‌పోతే కోర్టుకు వెళ్తామ‌ని చెప్ప‌ామని గుర్తుచేశారు. గతంలో చెప్పినట్టగా కోర్టును ఆశ్రయించ‌గా కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఆరు వారాల్లోగా కౌంటర్ ఫైల్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Recommended