భద్రాద్రి రామయ్యకు కొడాలి నాని బంగారు కిరీటం
  • 2 years ago
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.13లక్షలతో ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు కిరీటాన్ని స్వామివారికి కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా నాని దంపతులను అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Recommended