IND vs ENG : Rohit Sharma - Virat Kohli Clash ఇగో పక్కన పెట్టి ఆడాల్సిందే ! || Oneindia Telugu
  • 3 years ago
IND vs ENG 1st Test: Virat Kohli-led India will be hoping for a change in fortune in the upcoming series, having suffered a 1-4 defeat in England in 2018.
#INDvsENG1stTest
#RohitSharma
#ViratKohli
#RohitSharmaKohlirift
#IPL2021
#Testseries

సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మరో రసవత్తర పోరుకు సిద్దమవుతోంది. న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన..ఆ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లండ్‌ను సొంతగడ్డపై ఓడించాలంటే మాటలు చెప్పినంత సులువు కాదు. పకడ్బందీ ప్రణాళికలతో పాటు సరైన కాంబినేషన్స్‌తో బరిలోకి దిగాలి. లేకుంటే 2018, 2014 టూర్ ఫలితాలు రిపీట్ అవుతాయి. 2014లో ధోనీ సేన 1-3తో సిరీస్‌ను కోల్పోగా ఓ మ్యాచ్ డ్రా అయింది. 2018లో కోహ్లీసేన 1-4తో చిత్తయింది. ఈ సారి చరిత్రను తిరగరాయాలి. అలా చేయాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత శర్మలు తమ ఇగోలను పక్కన పెట్టి ఆడాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Recommended