Siddarth Gets serious Comments From Fans

  • 6 years ago
బీజేపీ, ఆరెస్సెస్ పార్టీలపై కామెంట్లు చేసి అనవసరపు వివాదంలో తలదూర్చిన విలక్షణ నటుడు, హీరో సిద్ధార్థ్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్‌లో ఓ వ్యక్తిపై సామూహిక దాడి చేసిన ఘటనపై స్పందిస్తూ అధికారపార్టీపై సోషల్ మీడియాలో సిద్దూ కామెంట్లు చేయడం వివాదంగా మారింది. పశువులను కబేలాకు తరలిస్తున్నారనే ఆరోపణలపై రక్బర్ ఖాన్ అనే వ్యక్తిపై అల్వార్ జిల్లాలో ఇటీవల సామూహిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ సిద్దార్థ్ ఏమని ట్వీట్ చేశారంటే..
ఓ మనిషిని దారుణంగా చావబాదుతారా? గోరక్షకులకు, పశువుల అంశానికి ఏమైనా సంబంధం ఉందా? హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ముందు గోశాలకు తీసుకెళ్లారా? అవును. ఈ వ్యవహారంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. మిస్టర్ రాథోడ్ (కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్) మీ తీరు బాగాలేదు. నీవో పిరికివాడివి అని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.

Siddharth on lynching comment against BJP
#Siddharth

Recommended