కోతల రాయుడు సినిమా ప్రారంభ వేడుక
  • 6 years ago

శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో తెరకెకకుతున్న చిత్రం 'కోతల రాయుడు'. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభమైంది. 'కృష్ణాష్టమి' ఫేం డింపుల్ చోపడే, 'జై సింహ' ఫేం నటషా దోషి హీరోయిన్స్.
సుధీర్ రాజు సుబ్బరాజుతో 'జయహే' చిత్రానికి దర్శకత్వం వహించారు. షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాకు డి.జే. వసంత్ సంగీతం అందిస్తున్నారు.
ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆగస్ట్ చివారివారంలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. రాజమండ్రి, బెంగుళూరులో చిత్ర షూటింగ్ అధికభాగం చిత్రీకరణ జరుపుకోనుంది.
శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్.

Actor Srikanth’s new film titled ‘KothalaRayudu’ is formally launched. Touted to be an entertainer, Sudheer Raju will be directing this flick. Dimple Chopade and Natasha Doshi of ‘Jai Simha’ fame are going to be the lead actresses of this flick. The film also have Sayaji Shinde, Posani Krishna Murali and Hema in supporting roles. DJ Vasanth will be composing music and Satish G will handle the cinematography.
#KothalaRayudu
Recommended