దేశంలో దొంగలు పడ్డారు ట్రైలర్ లాంచ్ చేసిన పూరి
  • 6 years ago
‘Deasamlo Dongalu Paddaru’ as they have wrapped up the shooting schedule of the film with effort and passion of each and everyone associated with the film including Khayyum, Taniahq Rajan, Shani, Prudhviraj and Sameer.

సారా క్రియేష‌న్స్ బ్యానర్‌పై గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌మా గౌత‌మ్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’. ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు .ఈ సినిమా టీజర్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు.
ఈ సంద‌ర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా నచ్చింది. చూడగానే ఇంప్రెస్ అయ్యాను. టైటిల్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా టీజర్‌ను ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించిన పూరి గారి ధన్యవాదాలు తెపుకుంటున్నా. సినిమా షూటింగ్ పూర్త‌యింది. వైజాగ్, సీలేరు, చింత‌ప‌ల్లి, డొంక‌రాయ‌, హైద‌రాబాద్ త‌దిత‌ర ప్ర‌దేశాల్లో షూటింగ్ చేసాం. ఇప్ప‌టివ‌ర‌కూ ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఎవ్వ‌రూ చేయ‌ని లోకేష‌న్ల‌లో షూటింగ్ చేసాం. ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్ స్టోరీ. హ్యామన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ తెర‌కెక్కిస్తున్నాం. ఇప్పుడు స‌మాజంలో జ‌రుగుతోన్న విషయాలను ప్ర‌తిబింబిస్తూ ఈ కాన్సెప్ట్‌ను తీర్చిదిద్దాం.. కథలో అన్ని ఎమోషన్స్ డిఫరెంట్ డైమెన్షన్ లో కనిపిస్తాయి. ముఖ్యంగా క్రైమ్ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి’’ అన్నారు.
Recommended