ఎయిరిండియా విమానంలో ప్రమాదం...ముగ్గురికి గాయాలు
  • 6 years ago
An Air India aircraft flying from Amritsar to Delhi on Thursday (April 19) ran into such severe turbulence that three passengers suffered injuries, the inside part of a window panel came off and some overhead oxygen masks got deployed.The Boeing 787 Dreamliner (VT-ANI) had a very turbulent flight for 10 to 15 minutes during climb phase from 8,000 feet to 21,000 feet, the cause of which is being probed by the airline and aviation agencies.

ఎయిరిండియా విమానంలో ప్రమాదం చోటు చేసుకుంది. విండో దగ్గరలోని ఆక్సిజన్ మాస్క్ ప్యాసింజర్ల పైన ఊడిపడింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. డీజీసీఏ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రయాణీకులను బెంబేలెత్తించిన ఈ సంఘటన గురువారం (ఏప్రిల్ 19) అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో చోటు చేసుకుంది. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది.
విమానంలోని విండో ప్యానెల్ దగ్గరి మాస్క్ విరిగి ప్రయాణీకులపై పడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో దాదాపు పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. భయంతో వణికారు. విమానంలో సీటు బెల్టు ధరించని ఓ ప్రయాణీకుడు బంప్ వద్ద ముందున్న కేబిన్‌ను గుద్దుకున్నాడు. దీంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బయటి విండో పగలకపోవడంతో ప్రమాదం తప్పింది. అక్కడి ఓవర్ హెడ్ ప్యానెల్ పగలడంతో ఆక్సిజన్ మాస్కులు కిందపడ్డాయని తెలుస్తోంది. వైర్లు వేలాడాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న డీజీసీఏ ఈ విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డుకు తెలిపింది.
Recommended