ఒకే దెబ్బకు రెండు పిట్టలు...!

  • 6 years ago
Withdrawing its two members from the Union council of ministers this week may be the easiest thing the Telugudesam Party could do, but it just cannot wish the Bharatiya Janata Party away.

టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర కేబినెట్ నుంచి తన ఇద్దరు ఎంపీలను ఉపసంహరించడం, ఎన్డీయేలోనే కొనసాగడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టారా? అంటే అవుననే అంటున్నారు.
బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో ఢిల్లీలో టీడీపీ ఎంపీలు తమ నిరసనలతో వైసీపీని ఒకింత కార్నర్ చేశారు. దీంతో వైసీపీ రాజీనామా అస్త్రాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించింది. కేంద్రంలో ఉండి టీడీపీ ఆందోళనలు ఎలా చేస్తుందని వైసీపీ మలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా పాయింట్ లాగింది.
ఈ అంశం తెలుగుదేశం పార్టీని ఒకింత ఇరకాటంలో పడేసింది. అప్పటికి సమర్థించుకున్నప్పటికీ.. కేంద్రమంత్రుల రాజీనామాలతో చంద్రబాబు ఒక్క దెబ్బకు అన్న చందంగా వ్యవహరించారని అంటున్నారు. సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు కేంద్రమంత్రులుగా రాజీనామా చేయడం ద్వారా వైసీపీ నోరు మూయించడంతో పాటు ఏపీ ప్రజల్లోకి హోదా కోసం తామే చిత్తశుద్ధితో ఉన్నామనే సంకేతాలు పంపించారని అంటున్నారు.
అంతేకాదు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు బీజేపీతో వెళ్లే అవకాశాన్ని ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. అందుకే కేబినెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఎన్డీయే నుంచి తప్పుకోలేదని చెబుతున్నారు. అయితే, బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపు టీడీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరమే.
చంద్రబాబు కేబినెట్ నుంచి బయటకు వచ్చి, ఎన్డీయేలోనే కొనసాగుతారని దాదాపు ఎవరూ ఊహించని పరిమాణం అనుకోవచ్చు. రాజకీయాల్లో చంద్రబాబు లెక్కలు వేరుగా ఉంటాయని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు. ఈ విషయంలో తొందరపడకుండా పక్కా ప్లాన్‌తో వ్యవహరించి ప్రత్యేక హోదా క్రెడిట్ కొట్టేయడంతో పాటు జగన్ బీజేపీ దరి చేరకుండా చేశారని అంటున్నారు.

Recommended