Iranian President Hassan Rouhani India Visit
  • 6 years ago
Iranian President Hassan Rouhani on Friday visited the historic Qutub Shahi Tombs hyderabad. Iranian leader visited the tombs along with other ministers and senior officials.


ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ శుక్రవారం నాడు కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించాడు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం హసన్ రౌహనీ గురువారం రాత్రి హైద్రాబాద్ కు వచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ రెండో రోజు నగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం షేక్‌పేట్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రౌహనీ సందర్శించారు. కుతుబ్‌షాహీ సమాధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్కామసీదుకు చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
స్వాతంత్ర్యం అనంతరం మక్కామసీదును సందర్శించిన తొలి విదేశీ దేశాధినేత హసన్ రౌహానీయే కావడం విశేషం.నగరంలో ముస్లిం ప్రముఖులు, రాజకీయనాయకులు, విద్యావేత్తలు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.