Four Of Family End Life By Jumping In Lake
  • 6 years ago
The police said that the incident occurred at Kondapur in Keesara mandal of Medchal district, around 40 km from Hyderabad.35-year-old Ramesh and his wife Manasa (22), jumped into the lake along with their two daughters - seven-month-old Manashri and three-year-old Geetashri.

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చెల్ జిల్లా కీసరలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్దమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కొండాపూర్ గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు ఆడపిల్లలను చెరువులో పడేసి తాము దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది
కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని భావిస్తున్నారు. కొండాపూర్‌లోని తమ ఇంట్లో దంపతులు గొడవ పడ్డారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. మరణించినవారిని రమేష్‌(25), మానస(23), మనశ్రీ(2), గీతశ్రీ( 6నెలలు)గా గుర్తించారు.
భార్య, పిల్లలతో కలిసి రమేశ్‌ సోమవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అనంతరం ఈ నలుగురు మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలో వారి కోసం మానస సోదరుడు వెతుకుతుండగా మంగళవారం ఉదయం కీసరలోని పెద్దమ్మ చెరువు వద్ద రమేశ్‌ ద్విచక్రవాహనం కనిపించింది. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనాస్థలికి చేరుకోగా మధ్యాహ్నానికి చెరువులో మృతదేహాలు తేలాయి.