చెరువులో పడి ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి : మద్యం బాటిళ్లు, మత్తు

  • 6 years ago
Four engineering students have drowned in a large pond in West Godavari district in Andhra Pradesh. The undergraduate students had gone for an outing on Saturday, during which they decided to jump into the water for a quick swim, police said.

జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం ఏలూరు శివారులోని పెదవేగి మండలం భోగాపురం పంచాయతీ పరిధిలో ఉన్న వట్లూరు పెద్ద చెరువులో మునిగి నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. పోలీసుల, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన అంకాల సాయికిరణ్‌ పరశురామ్‌(22), కామవరపుకోట మండలం కొత్తూరుకు చెందిన కె హరికృష్ణరాజు(22), చింతలపూడికి చెందిన గుమ్మి విజయశంకర్‌(22)లు ఏలూరులోని రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.
కాగా, చింతలపూడికి చెందిన కోటసాయి(21) ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరంతా స్నేహితులు. ప్రతీరోజూ తమతమ గ్రామాల నుంచి కళాశాల బస్సులో వచ్చి సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో శనివారం కళాశాలకని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన వీరు.. కళాశాలకు వెళ్లకుండా సరదాగా షికారుకు ఏలూరు శివారులోని వట్లూరు పెద్ద చెరువు ప్రాంతానికి వెళ్లారు
ఆ చెరువు పక్కనే ఉన్న జామతోటలో సరదాగా కొంతసేపు గడిపారు. తమతోపాటు తెచ్చుకున్న భోజనం చేశారు. ఆ తరువాత దగ్గరలోని చెరువులోకి ఈతకొట్టేందుకు దిగారు. చెరువు లోతుగా ఉండటంతో ఈ నలుగురు నీటిలో మునిగి మృతిచెందారు. చెరువు ఊరికి బాగా దూరంగా ఉండటం, ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకపోవడంతో ఈ విషయం ఆదివారం ఉదయానికి గాని వెలుగు చూడలేదు.

Recommended