ఎన్టీఆర్, రాంచరణ్‌కు రాజమౌళి వార్నింగ్ !

  • 6 years ago
After Baahubali, SS Rajamouli is going to do a film with Ram Charan and NTR as multi starrer. This movie is going to start in October of this year. Rajamouli given clarity to NTR, Ram Charan that all project would be finished by October for multi starrer movie.

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో మల్టీస్టారర్ సినిమాను రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిసిందే. అయితే ఈ మల్టీస్టారర్ సినిమాపై అనేక ఊహాగానాలు వస్తున్న అధికారికంగా నిర్మాత దానయ్య, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే సినిమాపై త్వరలో ప్రకటన చేయనున్నారనే ఫిలింనగర్ సమాచారం.
యంగటైగర్ , చెర్రీతో సినిమాను సంక్రాంత్రి రోజున అధికారికంగా ప్రకటించాలని ప్లాన్‌లో జక్కన్న ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇక చెర్రి, ఎన్టీఆర్‌లకు రాజమౌళి స్పష్టమైన డెడ్‌లైన్ విధించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న చిత్రం రంగస్థలం. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించే సైరా నర్సింహరెడ్డి చిత్ర నిర్మాణంలో కూడా బిజీగా ఉన్నారు.
ఇక రంగస్థలం చిత్రం తర్వాత బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ ఓ చిత్రాన్ని నటించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లోపు పూర్తి చేసుకోవాలని రాజమౌళి డెడ్‌లైన్ విధించారట.
జై లవకుశ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్‌ ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ముహుర్తం షాట్ ఓపెనింగ్ కూడా పూర్తయింది. త్రివిక్రమ్ సినిమాను అక్టోబర్‌లో పూర్తి చేసుకోవాలని కండిషన్ విధించినట్టు తెలుస్తున్నది.

Recommended