పవన్-కేసీఆర్ భేటీపై.. కత్తి దారుణమైన కామెంట్స్..

  • 6 years ago
Telangana Chief Minister K Chandrasekhar Rao and actor-politician Pawan Kalyan met each other on Monday at the former's camp office in Hyderabad.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ అధినేత హోదాలో 2018 న్యూఇయర్ ప్రారంభం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు మర్యాద పూర్వకంగా కలిశానని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేసీఆర్ పాలన ఎంతో బావుందని, రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు ఎన్నో పథకలు విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అయతే పవన్ కళ్యాణ్-కేసీఆర్ కలయిక వెనక అజ్ఞాతవాసి కోణం ఉందని యాంటీ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
పవన్-కేసీఆర్ భేటీ వెనక ‘అజ్ఞాతవాసి' సినిమా కోణం ఉందని, తెలంగాణ ప్రాంతంలో ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు వేసి భారీగా వసూళ్లు రాబట్టే ప్రయత్నంలో భాగమే ఇది అని కొందరి ఆరోపణ.
అయితే పవన్ కళ్యాణ్ మీద కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్న మమేష్ కత్తికి కూడా.... మరోసారి కామెంట్లతో రెచ్చి పోవడానికి ఈ భేటీ కారణం అయింది. ‘‘ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు, ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ విషస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్ కా?''... సరేగానీ, అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్ !'' అంటూ మహేష్ కత్తి చేసిన కామెంట్ల విమర్శల్లా లేవని, కావాలని కక్ష పూరితంగా చేసినట్లు ఉన్నాయని అభిమానులు అంటున్నారు.

Recommended