100 మంది మీద వేటు వేసిన ఓపీఎస్

  • 6 years ago
More than 100 AIADMK members have been removed by OPS and EPS. They have been removed for acting against AIADMK rules.

అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న నాయకుల మీద వేటు వెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయం తీసుకున్నారు.

అన్నాడీఎంకేలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న నాయకులు ఎవరైనా సరే చూస్తూ ఊరుకోకూడదని సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అంటున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ నాయకుల మీద నిఘా వేశారు.

అన్నాడీఎంకే పార్టీలో ఉంటూనే శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు ? అని ఇప్పటికే సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆరా తీశారు.

శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన 9 మందిని మొదటి విడతలో. 44 మందిని రెండవ విడతలో గురువారం బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని పళనిస్వామి, పన్నీర్ సెల్వం హెచ్చరించారు.
అన్నాడీఎంకే పార్టీలో ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా విషయాలు తెలుసుకుని టీటీవీ దినకరన్ కు సమాచారం ఇస్తున్న 100 మంది నాయకులను పళనిస్వామి, పన్నీర్ సెల్వం గుర్తించారు. టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న ఆ 100 మంది నాయకుల మీద శుక్రవారం వేటు పడింది.