బంపర్ ఆఫర్‌కు సాయి పల్లవి నో.. కారణం అదేనంట..!

  • 6 years ago
ఫిదా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల తార సాయి పల్లవి అటు తమిళంలోనూ, ఇటు తెలుగు, మలయాళంలో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా బిజీ స్టార్ అయిపోయింది. ఫిదా తర్వాత నేచురల్ స్టార్ నానితో నటించిన ఎంసీఏ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. తెలుగులో మంచి పొజిషన్ కల్పించిన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రపోజల్‌ను సున్నితంగా తిరస్కరించిందనే ఓ నిరాధారమైన వార్త ఫిలింనగర్ సర్కిళ్లలో ప్రచారం అవుతున్నది. తనకు టాలీవుడ్‌లో లైఫ్ ఇచ్చిన నిర్మాతతో సాయి పల్లవి అలా ప్రవర్తిస్తుందా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫిదా బ్లాక్‌బస్టర్ తర్వాత వెంటనే ఎంసీఏ చిత్రంలో నాని పక్కన నటించే అవకాశాన్ని కల్పించాడు దిల్ రాజు. ఈ చిత్రం కూడా పూర్తయి డిసెంబర్ మూడో వారంలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో సాయి పల్లవి డెడికేషన్‌కు ఫిదా అయిన దిల్ రాజు మరో అవకాశాన్ని ఇవ్వాలనుకొన్నారట.

Recommended