Hyderabad Police Arrested Dacoits : 1.2 కోట్ల సొమ్ము రికవరీ ! | Oneindia Telugu

  • 6 years ago
The Hyderabad Police arrested five dacoits and recovered over Rs 1.2 crore cash, Honda Africa superbike and three mobile phones used from their possession.

హైదరాబాదులో మైసూరు నగల వ్యాపారుల నుంచి రూ.1.27 కోట్లను దోపిడీ చేసిన ముఠాను పోలీసులు ఆరుగంటల వ్యవధిలోనే పట్టుకుని తమ సత్తా చాటారు. పూర్తి సొమ్మును రికవరీ చేశారు. దోపిడీ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే శనివారం హైదరాబాద్‌కు చేరుకున్న మైసూర్‌కు చెందిన నగల వ్యాపారులు బషీర్‌బాగ్‌లోని స్కైలైన్ అపార్ట్‌మెంట్‌లోని పేయింగ్ గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. ఇక్కడ రాజస్థాన్‌కు చెందిన నానాలాల్ కుమావత్ వంటమనిషిగా పనిచేస్తున్నాడు
పేయింగ్ గెస్ట్ హౌస్‌కు వచ్చే వారివద్ద పెద్ద ఎత్తున డబ్బుంటుందని, వారిని దోచుకోవడానికి పథకం పన్నిన నానాలాల్ అవకాశం కోసం ఎదురు చూసి దొంగతనం చేసాడు. అయితే బషీర్‌బాగ్‌లో రాజ్‌కుమార్ అనే వ్యాపారి తన దుకాణానికి ఏర్పాటు చేసిన నేను సైతం కెమెరాలు దోపిడీ దొంగలకు సంబంధించిన క్లూను పోలీసులకు ఇచ్చాయని సీపీ చెప్పారు. దాని సాయంతో ఈ కేసును ఛేదించామని, కెమెరాలు ఏర్పాటు చేసుకున్న రాజ్‌కుమార్, వాటి ఏర్పాటుకు సహకరించిన రషీద్‌లను అభినందించారు.

Recommended