YSRCP MP on Chandrababu and Lokesh : బాబులాగే లోకేష్ కూడా
  • 6 years ago
YSRCP MP YV Subba Reddy on Tuesday lashed out at Andhra Pradesh CM Chandrababu Naidu and minister Lokesh.

ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డి పై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ఒంగోలులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. జగన్‌ పాదయాత్ర ప్రారంభించగానే టీడీపీలో వణుకు మొదలైందని, ప్రజలు జగన్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు అరాచకాలన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు.
సత్యాలను వక్రీకరిస్తూ చట్టసభను తప్పుదోవ పట్టిస్తున్నమంత్రి నారా లోకేష్‌పై లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్‌లకు ఫిర్యాదు చేస్తాం. నరేగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, దీనిపై విచారణ చేయాలని మాత్రమే లేఖలు రాశాం. నిధులు ఆపమని కాదు. పదిసార్లు అబద్ధాలు చెబితే అవి నిజాలు కావు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్‌ గమనించాలి. మంత్రి లోకేష్‌ వారి నాన్న చంద్రబాబు మాదిరిగా ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేయాలనే సంస్కృతిని ఫాలో అవుతున్నట్లున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నరేగ ఫండ్స్‌ సరిగ్గా వినియోగించడం లేదని, పేదలకు మూడు పూటలా తిండితినేందుకు తెచ్చిన పథకం నీరుగారిపోతుందని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, యంత్రాలతో పనిచేయిస్తున్నారని లేఖ రాశాం' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
Recommended