వాట్..! అది మోహన్ బాబు, రాజశేఖర్‌ల సినిమానా?

  • 6 years ago
Mohan Babu and Rajasekhar were supposed to play the lead roles in 'Hanuman Junction'. Editor Mohan who was the producer of that project had even paid advances to them. Still, The multi-starrer in this combination was shelved. What happened actually?

టాలీవుడ్ లో ఒక సంవత్సరం లో ఎన్ని సినిమాలు వస్తాయో అంతకంటే ఎక్కువ సినిమాలే మధ్యలో ఆగిపోతాయి.. కొన్ని సినిమాలైతే దాదాపు షూట్ మొదలయ్యేదాకా వచ్చిమరీ అటకమీదికెక్కేస్తాయి. కారణాల్వేమిటీ అంటే సవాలక్ష.., డబ్బు, యాక్టర్స్ కి కథ నచ్చకపోవటం, ఇక కొన్నైతే విభేదాల వల్ల కూడా ఆగిపోయాయి.
అయితే అదే తరహాలో విభేదాలు వస్తాయేమో అని ఓ మల్టి స్టారర్ మూవీ ఆగిపోయిందట. అదీ హీరో రాజశేఖర్, మరో క్రేజీ స్టార్ మంచు మోహన్ బాబుల కాంబోలో ప్లాన్ చేసిన సినిమా... చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ న్యూస్ ప్రస్తుతం చాలా వైరల్ అయ్యింది.
రీసెంట్ గా గరుడవేగ సినిమాతో మంచి హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ ఈ మధ్యన వార్తల్లో బాగా నిలుస్తున్నారు. ఇంటర్వ్యూలలో కొన్ని ఘటనల గురించి చెబుతూ.. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుస్తున్నారు. ఇకపోతే రాజశేఖర్ - మోహన్ బాబు కలయికలో ఎడిటర్ మోహన్ ఒక సినిమాను నిర్మించాలని అనుకున్నారట.
మళయాలం లో హిట్ అయిన తేంకాశీపట్నం అనే కథను కూడా ఒకే చేశారు. అయితే రాజశేఖర్ సినిమా షూటింగ్ లకు లేట్ గా వస్తారని అప్పట్లో టాక్ బాగానే ఉండేది. అయితే నిర్మత నటీనటులకు టెక్నీషియన్స్ కి అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారట.

Recommended