Pawan Kalyan For Prestigious Award ప్రతిష్టాత్మక అవార్డ్ కోసం పవన్ కళ్యాణ్

  • 6 years ago
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో బ్రిటన్ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ కోసం యూరప్‌లో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ యూకేలోని హౌస్ ఆప్ లార్డ్స్ వెళ్లేందుకు కొంత విరామం తీసుకోనున్నారు. అక్కడ ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం అవార్డును ఆయన అందుకోనున్నారు.
ఈ అవార్డును వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రతి ఏడాది ఒకరికి ఇస్తుంటారు. శ్రీకాకుళంలోని ఉద్ధానం సమస్యపై స్పందనకు గాను పవన్ కళ్యాణ్‌కు దీనిని ఇస్తున్నారు. ఉద్దానం సమస్యను పవన్ లేవనెత్తడం వల్ల ప్రభుత్వం కదిలింది. వైద్య నిపుణులు కూడా ముందుకు వచ్చారు.
నవంబర్ 15వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ యూరోప్‌లో సినిమా చిత్రీకరణలో ఉంటారని, ఆ తర్వాత యూకేకు వెళ్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత భారత్ వచ్చాక అతను జనసేన పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. ఇక ఇదిలా ఉంటె 2019ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీకి సంబంధించి జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి స్పందించారు. తమ అధినేత అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. దీంతో పవన్ పోటీపై నెలకొన్న సందిగ్దం వీడినట్టయింది. అయితే పవన్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దీంతో అనంతపురంతో పాటు ఏలూరు నుంచి కూడా ఆయన బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Actor Pawan Kalyan will be busy shooting for his upcoming film with director Trivikram Srinivas in Europe until November 15. The unit is currently filming some important scenes and a few songs as well.

Recommended