Betting After Bhuma Brahmananda Reddy's Win In Nandyal
  • 7 years ago
It is said that some people won lakhs of rupees in betting after Bhuma Brahmananda Reddy's win in Nandyal. it is said that one leader won one crore rupees.
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున బెట్టింగులు సాగాయి. అభ్యర్థుల గెలుపోటములతో పాటు, మెజార్టీ పైన కూడా భారీగా బెట్టింగులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు, ఆయన మెజార్టీపై బెట్టింగులు కట్టిన వారు బాగా రాబట్టారు. వేలు, లక్షల్లో పందేలు కాశారు. ఈ బెట్టింగులో ఓ వ్యక్తి కోటీశ్వరుడు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
పార్టీపై ఉన్న అభిమానంతో సదరు టిడిపి నాయకుడు, అతని మిత్రులు కూడా తెలుగుదేశం గెలుస్తుందని వాదించారు. వైసిపి గెలుస్తుందని మరో వ్యక్తి వీరితో వాదనకు దిగాడని తెలుస్తోంది. దీంతో ఇది బెట్టింగ్ వరకు వెళ్లిందని తెలుస్తోంది. టిడిపి గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టారు.
Recommended